ఏపీలో లాగే తెలంగాణలో వలంటీర్ వ్యవస్థను తెస్తాం – రేవంత్ రెడ్డి

-

ఏపీలో లాగే తెలంగాణలో వలంటీర్ వ్యవస్థను తెస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే..వలంటీర్ వ్యవస్థను తెస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే రెవెన్యూ డివిజన్ చేస్తామని, ఈ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జనగామలో నిర్వహించిన విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు.

revanth reddy

ఈ సందర్భంగా మాట్లాడుతూ… జనగామ గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు. తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, ఆయనను 47 ఏళ్లు పార్టీ మోసిందని, కానీ చివరకు మోసం చేశారన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని, పల్లా రాజేశ్వర్ రెడ్డే చెప్పారన్నారు. లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేశాడని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానికి దక్కిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version