వివేక్‌ చేరికతో కాంగ్రెస్‌కు 1000 ఏనుగుల బలం వచ్చింది : రేవంత్‌రెడ్డి

-

వివేక్‌ చేరికతో కాంగ్రెస్‌కు 1000 ఏనుగుల బలం వచ్చిందన్నారు కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. బీజేపీకి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి రాజీనామా చేశారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్‌.. బీజేపీకి వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ తరుణంలోనే కాసేపటి క్రితమే.. రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు వివేక్‌ వెంకటస్వామి.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని వివేక్ నమ్మారన్నారు. వివేక్‌ చేరికతో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని వెల్లడించారు రేవంత్‌ రెడ్డి. వివేక్‌ చేరికతో కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం ధీమా వ్యక్తం చేశారు. అటు వివేక్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని వివేక్ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం తమ కుటుంబ ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని.. ప్రజా సంక్షేమం ఆ పార్టీకి పట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరానని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news