బీజేపీ, బీఆర్ఎస్​లో చేరిన వాళ్లు పవిత్రులా?.. రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ రెడ్డి లేఖ

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్‌ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను మోదీ, కేసీఆర్‌ పావులుగా మార్చుకున్నారని అన్నారు. ప్రజల తరఫున పోరాడితే ద్రోహులా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్​లో చేరిన వాళ్లు పవిత్రులా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

“కేసీఆర్​కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్​ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై… దాడులు జరుగుతాయి. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు… కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా? పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉంది. నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. వివేక్‌ కుటుంబంపై జరిగిన దాడి కాంగ్రెస్‌పై జరిగినట్లే భావిస్తాం. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను ఈసీ కాపాడాలి.” అని రేవంత్ రెడ్డి లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news