ఎన్నికల్లో పోటీ చేసే వారు దరఖాస్తు చేసుకోవాలి..మళ్లీ డబ్బులు ఇవ్వం – రేవంత్‌ రెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దరఖాస్తు ఫార్మ్ ను ఆవిష్కరించారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, భట్టి. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 25 వేలు… ఇతరులకు 50 వేల ఫీజు నిర్ధారించినట్లు స్పష్టం చేశారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వడం ఉండదు… పార్టీ అకౌంట్ లోకి వెళ్తాయని వెల్లడించారు రేవంత్‌ రెడ్డి.

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుండి 25 వ తేదీ వరకు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ తరువాత దరఖాస్తు దారుల పై సర్వే చేయడం జరుగుతుంది…. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ కి జాబితా ఇస్తామని చెప్పారు రేవంత్‌ రెడ్డి. స్క్రీనింగ్ కమిటీ పేర్లను ఫైనల్ చేసి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కు పంపిస్తాం…సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటిస్తుందని వెల్లడించారు. అప్పటి వరకు అభ్యర్థుల ఫైనల్ అయ్యారని జరిగే ప్రచారం నమ్మకండి..దయచేసి కార్యకర్తలను తప్పుదోవ పట్టించకండని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news