OU వివాదం పై స్పందించిన రేవంత్ రెడ్డి.. అదంతా కేసీఆర్ ప్రచారమే !

-

Revanth Reddy reacted to the OU controversy: కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్‌. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి, విద్యుత్ కొరతపై కేసీఆర్ చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ ఖండించారు. ‘కేసీఆర్ ను చూస్తే గొబెల్ మళ్లీ పుట్టాడు అనిపిస్తుంది. తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

Revanth Reddy reacted to the OU controversy

కేసీఆర్ సీఎంగా ఉన్నా 2023లో కూడా నెల రోజులు సెలవు ఇచ్చారు. అప్పుడు విద్యుత్, నీటి కొరతలు ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news