షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం కాకుండా అడ్డుకుంటున్న రేవంత్ ?

-

వైయస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను షర్మిల ఖండిస్తున్నప్పటికీ… దీని వెనుక ఓ పెద్ద రీసన్ ఉందట. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా కొంతమంది లీడర్లు ఆపుతున్నారట.

తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని షర్మిల విశ్వప్రయత్నాలు చేస్తుండగా రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ఆమె ఆశలకు గండి కొడుతున్నారు. రెండు రోజుల క్రితం జూన్ 28న ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన మీటింగ్‌లో ఆ వ్యూహకర్త పాల్గొన్నాడు.

గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన షర్మిల పార్టీని విలీనం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బ తింటాయి అని చెప్పినట్లు సమాచారం. 2018లో చంద్రబాబుతో పొత్తు తరహాలో దెబ్బతింటామని, కావాలంటే ఆమె సేవలను ఆంధ్రలో వాడుకుందామని అతను చెప్పినట్లు సమాచారం. అయితే ఇదంతా అతని వెనుక రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు అనేది కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news