కాంగ్రెస్,బీజేపీలకు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లే – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లేనని సంచలన వ్యాఖ్యాలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌. BRS సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ… ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట గారడీ చేస్తున్నది. దేశంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదు,జరుగదన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూ,ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి, దేశాన్ని విభజించడమే బీజేపీకి ఎన్నికల ఎజెండాగా మారింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లే!ఎంతో పోరాట స్పూర్తితో…ప్రాణాలకు తెగించి, కోట్లాడి సాధించిన తెలంగాణను అదే స్పూర్తితో 10 ఏళ్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన KCR గారి నాయకత్వాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిద్దామని పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news