సంపత్ రెడ్డి మరణం బీఆర్ఎస్ కి తీరని లోటు : కేటీఆర్

-

జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పాగాల సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాగాల సంపత్ రెడ్డి సోమవారం సాయంత్రం వేళ గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు. కాగా సంపత్ రెడ్డి జనగామ నుంచి బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్​రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు కృషి చేశారు.

పాగాల సంపత్ రెడ్డి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆర్థికంగా, రాజకీయపరంగా పూర్తిగా అండదండలు అందిస్తామని తెలిపారు. చిన్న వయసులోనే పాగాల సంపత్ రెడ్డి మృతి చెందడం నన్ను కలచివేసింది అన్నారు. సంపత్ రెడ్డి మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news