పారిశుద్ధ్య కార్మికులు సమ్మె మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన..సమ్మెలు చేయకండి

-

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపిస్తాయి… ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు.

పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని వివరించారు. సీఎం దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయి..సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో అడగకుండానే వెయ్యి రూపాయల వేతనం పెంచారని గుర్తు చేశారు. పనికి మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని కోరారు హరీష్‌ రావు. సీఎం కేసీఆర్ మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారని.. ఎలాంటి సమ్మెలు, ధర్నాల్లో పాల్గొనవద్దని కోరారు హరీష్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news