ప్రయాణికులకు అలర్ట్…సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ టైమింగ్స్ మార్పు

-

ప్రయాణికులకు అలర్ట్. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ టైమింగ్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. SECBAD-TPTY మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ మారనున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది.

ఈ నెల 17 నుంచి 16 కోచ్ లతో అందుబాటులోకి రానుండగా… ఇరువైపులా మారిన టైమింగ్స్ తో నడవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు తిరుపతికి బయలుదేరుతుండగా… కొత్త టైమింగ్స్ ప్రకారం 6.15 గంటలకు బయలుదేరుతుందని సమాచారం. అయితే ఇంకా మార్చిన వేళలను ఐఆర్ సిటిసి అధికారిక వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు.. తమ ప్రయాణాలను ఫిక్స్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news