మంత్రి పువ్వాడ పై తుమ్మల సంచలన ఆరోపణలు

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలవేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పీడును పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కే విధంగా పాటు పడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను అరాచక అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలని కామెంట్ చేశారు.

ఇక మంత్రి అజయ్ కుమార్ ను కాసిం రాజ్వితో పోల్చారు తుమ్మల నాగేశ్వరరావు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగే వారు కానీ ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్టు తీసుకొచ్చి నాకు చెబుతున్నారు పోలీసులు కూడా అధికారం ఉన్నవారి వైపే ఉన్నారని తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఫైర్ అయ్యారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి పాలనను కొనసాగిస్తున్నారు అంటే మనందరికీ సిగ్గుచేటు అన్నారు. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news