కడపలో టీడీపీ మహిళా నేత సంచలన విజయం

-

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా వెళ్తున్న వైసీపీ పార్టీకి.. తమ కంచుకోట అయిన కడపలోను భారీ షాక్ తగిలింది. కడప అసెంబ్లీ స్థానం నుంచి పోటీపీలో ఉన్న టీడీపీ మహిళా నేత రెడ్డప్పగారి మాధవి రెడ్డి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె 5 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. పూర్తి వివరాలు వచ్చే సమయానికి మెజార్టీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 15 స్థానాల్లో మాత్రమే లీడ్ లో కొనసాగుతుంది. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా వైసీపీ దారుణంగా కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news