బీఆర్ఎస్ కి షాక్.. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ విజయం..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ గెలిచిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఇటీవలే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తాజాగా కంటోన్మెంట్ లో నియోజకవర్గంలో  బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన గణేష్ గతంలో  పోటీ చేసి ఓడిపోయారు.

బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ నివేదితపై గెలుపొందారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65కు చేరగా బీఆర్ఎస్ బలం 38కి పడిపోయినట్లు అయింది. కాగా, తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ జీరో స్థానాలకే పరిమితం కానుంది. అన్ని స్థానాల్లో కారు పార్టీ మూడో స్థానంలోనే ఉంది. మెదక్పై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నా అక్కడ సైతం రఘునందన్ రావు భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news