నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం..!

-

సాధారణంగా కొన్ని సందర్భాల్లో పలువురు రాజకీయ నాయకులను, ఎమ్మెల్యే, ఎంపీలను సైతం పోలీసులు గుర్తు పట్టకపోవడం గమనార్హం. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ను పోలీసులు గుర్తు పెట్టకపోవడం నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు భువనగిరి కి వెళ్లారు. ఈ తరుణంలో నకిరేకల్ వేముల వీరేశానికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వీరు ప్రత్యేక హెలికాప్టర్ లో భువనగిరికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే మంత్రులకు స్వాగతం చెప్పేందుకు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన వేముల వీరేశంను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కూడా గుర్తు పట్టే స్తాయిలో లేరా అంటూ అలిగి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news