కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణకు స్వాతంత్ర్యం – వైఎస్ షర్మిల

-

కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణకు స్వాతంత్ర్యం అన్నారు వైఎస్ షర్మిల. YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంత వరకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలేదు.. తెలంగాణ బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగానికి తగరా? అర్హులు కారా? కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దళిత బంధు అన్నారు.. బీసీ బంధు అన్నారు.. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు.. ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ గారికి అంటూ రెచ్చిపోయారు షర్మిల. ఆనాడు బ్రిటిష్ వాళ్లు తెల్ల దొరలు పాలిస్తే .. ఈరోజు తెలంగాణలో మన నల్ల దొర కేసీఆర్ ఒక దొర లాగే పరిపాలిస్తున్నారు.. వాళ్లు దోపిడీ చేశారు.. ఈయన దోపిడీ చేస్తున్నారు..వాళ్లు ద్రోహం చేశారు.. ఈయన ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ నియంత పాలన పోవాలి..కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అంటూ రెచ్చిపోయారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news