రాజన్న బిడ్డను ముట్టేముందు..కేసీఆర్‌ పై చర్యలు తీసుకోవాలి – షర్మిల

-

రాజన్న బిడ్డను ముట్టేముందు..కేసీఆర్‌ పై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ షర్మిల సవాల్‌ చేశారు. బూతు పురాణంలో ఆరితేరిన కేసీఆర్ పై, మంత్రి నిరంజన్ రెడ్డిపై, మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి.ఆ తర్వాతే రాజన్న బిడ్డను ముట్టుకోవాలని డిమాండ్‌ చేశారు షర్మిల. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తే.. అది మీకు తిట్టినట్లు అయిందా? అని నిలదీశారు.

మంత్రి నిరంజన్ రెడ్డి పాలమూరు బిడ్డే అయితే,ఈ జిల్లా ప్రజల మీద ప్రేమే ఉంటే.. నిజంగా నీళ్ల నిరంజన్ రెడ్డివే అయితే ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టు కోసం మేం చేస్తున్న 24గంటల నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొనాలని సవాల్ విసురుతున్నామని పేర్కొన్నారు వైఎస్‌ షర్మిల. ఇప్పటి వరకూ ఖర్చు చేసిన 17వేల కోట్లు నీళ్లలోపోసినట్లేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని సగానికి పైగా సాగునీటి ప్రాజెక్టులు మేఘా కృష్ణారెడ్డికే అప్పగిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్, బీజేపీలు సైతం పెదవి విప్పడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news