వరకట్నం కోసం అత్తింటి వారి బరితెగింపు..గర్భిణికి యాసిడ్ తాగించి హత్య

-

సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇది.అదనపు కట్నం కోసం అత్తింటి వారు బరితెగించారు.గర్భిణీ అని కూడా చూడకుండా కోడలిని అత్తింటివారు చిత్రహింసలకు గురిచేశారు.బలవంతంగా విషంతో పాటు యాసిడ్ తాగించి, హత్య చేశారు. ఘటన పలువురిని కన్నీళ్లు పెట్టిస్తోంది.వివరాల్లోకి వెళితే..తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజ్పేట్ తండాకు చెందిన తరుణ్ తో మల్కాపూర్ కి చెందిన కళ్యాణి(24) కి రెండేళ్ల క్రితం పెద్దలు వివాహం జరిపించారు.కొన్నాళ్ల పాటు భర్త,అత్తింటివారు కళ్యాణి ని బాగానే చూసుకున్నారు.అనంతరం అదనపు కట్నం కోసం ఆమెను హింసించడం మొదలుపెట్టారు.

కొంతకాలానికి కళ్యాణి గర్భం దాల్చింది.అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు.ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.దీంతో మరింత దారుణంగా చిత్రహింసలు పెట్టారు.ఈ క్రమంలో మంగళవారం దారుణానికి ఒడిగట్టారు.భర్త తరుణ్, మామ ఫకీరా, బంధువు ప్రవీణ్ ఆమెతో విషం తాగించారు.అంతటితో ఆగకుండా యాసిడ్ కూడా నోట్లో పోశారు.బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ అక్కడకు వచ్చింది.అప్పటికే కళ్యాణి నురగలు కక్కుతూ పడిపోయి కనిపించింది.వెంటనే ఆమెను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా బుధవారం కన్నుమూసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news