టీఆర్ఎస్ ప్లీనరీ అంతా సొల్లు కబుర్లు, సోది పురాణమే: లక్ష్మణ్, బీజేపీ నేత

-

టీఆర్ఎస్ ప్లీనరీ అంతా సొల్లు కబుర్లు, సోది పురాణమే అని ఎద్దేవా చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్. చైనాకు దసోహం అనే జాతీయ రాజకీయాలు కావాల..? సర్జికల్ స్ట్రైక్ పై ఆధారాలు అడిగే జాతీయ రాజకీయాలు కావాలా..? అసలు మీ సిద్ధాంతం ఏమిటని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా మరో 20 ఏళ్ల వరకు జాతీయవాదం, ఆత్మనిర్భర భారత్ ప్రజల్లో నాటుకుపోయిందని ఆయన అన్నారు. మీరు స్వార్థపూరిత ఎజెండాతో, ప్రజల నుంచి మీ తప్పిదాలను, వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు జాతీయ రాజకీయాలు అంటున్నారని విమర్శించారు. ఈరోజు 4 లక్షల కోట్ల అప్పులు చేశారని… ఇలాగే దేశాన్ని అప్పులు ఊబిలో నెట్టడానికి జాతీయరాజకీయాల్లో వస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. అవినీతి సొమ్ముద్వారా రాజకీయాలు చేయడం, ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ నుంచి పాలించడం, ఊరూరా సారా, బీరు, బెల్ట్ షాపులు దేశానికి రోల్ మోడలా? అంటూ ప్రశ్నించారు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెంచడం ఇలా దేశంలో కూడా చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. మీరు భారత రాష్ట్రీయ సమితి ( బీఆర్ఎస్) పెట్టుకున్నా మీకు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయని ఆయన అన్నారు. హలాల్, హిజాబ్ గురించి మాట్లాడుతున్నారని… మీరు బైంసా అల్లర్లు, బోధన్ అల్లర్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. హిందువుల మీద దాడులు జరిగితే చప్పుడు లేకుండా కూర్చోవాలి… హిందువులను కించపరచడం మత సామరస్యం అవుతుందా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news