నవీన్ మర్డర్ కేసులో హత్యచేసిన అనంతరం షెల్టర్ ఇచ్చిన అసన్ చెప్పిన విస్తుపోయే విషయాలు

-

అబ్దుల్లాపూర్మెట్ నవీన్ మర్డర్ కేస్ లో హత్య చేసిన అనంతరం షల్టర్ ఇచ్చిన అసన్ విస్తుపోయే విషయాలను వెల్లడించారు. అబ్దుల్లాపూర్మెట్ లో జరిగిన నవీన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయాలు వేలుగులోకి వస్తున్నాయి. మృతుడు నవీన్ కి గంజాయి అలవాటు ఉందని.. హరిహర కృష్ణకు కేవలం మద్యం సేవించే అలవాటు ఉందని తెలిపాడు ఆసన్. కళాశాలలో ఉన్నప్పుడు హరిహర కృష్ణ మంచివాడిగానే ఉండేవాడని.. కేవలం అమ్మాయి కోసమే మర్డర్ చేశాడని తెలిపాడు అసన్.

“మర్డర్ చేసిన అనంతరం హరి హర కృష్ణ నిందితుడు అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జేఎన్ఆర్ ఎమ్ కాలనీలో ఉంటున్న తన ఇంటర్మీడియట్ మిత్రుడు అసన్ ఇంటికి వెళ్లడం జరిగింది, అసన్ కి రాత్రి 12 గంటల 20 నిమిషాలకు హరిహర కృష్ణ ఫోన్ చేసి తన ఇంటి వద్దకు వచ్చానని బయటకు రావాలని చెప్పగా బయటకు వెళ్లిన అసన్ ఈ రాత్రి ఎందుకు వచ్చావు అని అడగ్గా తాను చేసిన మర్డర్ గురించి చెప్పాడని అప్పటికే వచ్చే సమయంలో బాడీ పార్ట్స్ ను పడేసి వచ్చినట్లు తెలిపారని…

పోలీసులకు లొంగిపోవాలని చెప్పినా కూడా వినకుండా తనకొక డ్రెస్ కావాలంటే తాను విడిచిన డ్రెస్ ఇవ్వగా అది వేసుకొని ఉదయం తెల్లవారు జామున 4 గంటలకి తూర్క యంజల్ మీదుగా హస్తినాపురం వెళ్లి ప్రేయసిని కలిసినట్టు తనకు హరిహర కృష్ణ తెలిపారని అసన్ తెలిపాడు. సదరు ప్రేయసిని కలిసిన అనంతరం తన తండ్రికి చెప్తానని వెళ్లి అక్కడ నుండి వరంగల్ వెళ్లారని అప్పటినుండి నాకు టచ్ లో లేరని అతని లొంగిపోయిన అనంతరం వరుసటి రోజు పోలీసులు మా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారని తెలిపాడు అసన్.

Read more RELATED
Recommended to you

Latest news