అక్రమంగా యూరియా తరలించినందుకు షోకాజ్ నోటీసులు..!

-

భద్రాద్రి ఇల్లందు సొసైటీ నుండి అక్రమంగా ప్రైవేట్ ఎరువుల దుకాణానికి యూరియాను తరలించిన కేసులో సొసైటీ సెక్యూరిటీ హరిప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షిద్. సెక్యూరిటీతో పాటుగా అక్కడ పని చేస్తున్న మరో తాత్కాలిక ఉద్యోగిని కూడా విధుల నుండి తొలగించారు. అయితే ఇల్లందు సొసైటీ నుండి మండలం లోని మాణిక్యారం ఎంటర్ప్రైజెస్ అనే ఎరువుల దుకాణానికి అక్రమంగా 70 యూరియా బస్తాలు తరలించారు.

ఇక విషయం తెలుసుకున్న అధికారులు గత రెండు రోజులుగా విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఇప్పుడు జిల్లా సహకార అధికారులు సస్పెండ్ చర్యలకు శ్రీకారం చుట్టారు. అలాగే అక్రమంగా ఎరువులు తీసుకున్న జె కే ఎంటర్ప్రైజెస్ దుకాణం యజమాని జనగాం కోటేశ్వరరావు కు షోకాజ్ నోటీస్ లు జారీ చేసారు. ఇక మీదట ఆ షాప్ లో ఎరువులను విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news