సోషల్ మీడియా కల్చర్ తెచ్చింది టీడీపీనే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంతకాలం నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనీ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జగ్గారెడ్డి మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నానని.. ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.

టిఆర్ఎస్ పై కొట్లాడి గెలిచానని.. 2018లో జైలుకు వెళ్లానని చెప్పారు జగ్గారెడ్డి. గతంలో రాహుల్ పాదయాత్ర జరిగిన పది రోజులకే తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేశారని.. నా పేరు రాహుల్ కు నోట్ అయిందని.. పాదయాత్రలు తాను చేసిన ఏర్పాట్లను చూసి రాహుల్ మెచ్చుకున్నారని చెప్పారు జగ్గారెడ్డి.  ఎప్పుడూ తనపై ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని.. ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు జగ్గారెడ్డి.  మరోవైపు కొంత మంది జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా రాస్తే ఆధారాలు చూపించే వరకు వదిలిపెట్టను అని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. తాను పార్టీ మారుతున్నట్టు రకరకాలుగా రాస్తున్నారని ఇవన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. అసలు సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి వచ్చిందని వెల్లడించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news