గడ్డి తినేందుకు కూడా కల్వకుంట్ల కుటుంబం వెనుకాడరు : డీకే అరుణ

-

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో
మాట్లాడుతూ.. బీజేపీ ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమవుతోంది అని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని డీకే అరుణ తెలిపారు. 9 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను ప్రారదొలెందుకు ప్రజలు రెడీగా ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు డీకే అరుణ. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వాతావరణం క్రియేట్ కోసమే ఎమ్మేల్యేలు పర్యటన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు డీకే అరుణ. వారం రోజుల పాటు తెలంగాణలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు అని డీకే అరుణ వెల్లడించారు.

CM KCR cheating farmers, not keeping word: DK Aruna

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజల ఆకాంక్షల మీద రిపోర్ట్ తయారు చేస్తారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. కేసీఆర్ కి ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకు వస్తాయి.. ప్రభుత్వ భూములు అమ్మీ.. ఆ సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నాడుని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారు అని పేర్కొంది. బీజేపీ 18 రాష్ట్రాల్లో పాలిస్తుంది.. అక్కడ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని డీకే అరుణ అన్నారు. అన్ని పార్టీల్లో చివరి నిమిషంలో జంపింగులు కామన్.. జనాల్ని దోచుకోవడమే ట్రైలర్ గా బీఆర్ఎస్ పార్టీ చూపించింది అని తెలిపింది. అధికారం కోసం గడ్డి తినేందుకు కూడా కల్వకుంట్ల కుటుంబం వెనుకాడరు.. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు మతం పేరుతో గెలవాలని చూస్తున్నారు అని డీకే అరుణ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news