నేటి నుంచి ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు

-

నేటి నుంచి ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఇంతకీ రద్దయిన రైళ్లు ఏవో తెలుసా..?

గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు, విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దుచేశారు.

గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243), మచిలీపట్నం-విశాఖపట్నం (17219), విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 9 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, రాయగడ-గుంటూరు (17244), విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్‌లను 10 వరకు రద్దుచేసినట్లు తెలిపారు. తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుందని, విశాఖలో బయల్దేరాల్సిన విశాఖపట్నం-తిరుపతి (22707) రైలు 7, 9 తేదీల్లో సామర్లకోట స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news