BREAKING : బీజేపీ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

-

యెన్నం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఊహించని షాక్‌ ఇచ్చింది. యెన్నం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేసింది అధిష్టానం. బీజేపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

yennam-srinivas-reddy
yennam-srinivas-reddy

కాగా, ఆశావహుల నుంచి బీజేపీ ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news