సిద్దిపేటలో విషాదం.. కరెంట్ షాక్ తో పెళ్ళికొడుకు మృతి

-

సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి విషాద ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన వారు పెళ్లి రోజునే తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ జంట మరణించింది. మరోవైపు పెళ్లి రిసెప్షన్ రోజే మరో వ్యక్తి.. ఇలా రకరకాలుగా కొత్త దంపతులిద్దరిలో ఎవ్వరో ఒకరూ మరణిస్తున్నారు.

అందుకు కారణం మన అజాగ్రత్త అనే చెప్పవచ్చు. ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే  మరణాలను అదుపు చేయవచ్చు. తాజాగా సిద్దిపేట జిల్లాలో కరెంట్ షాక్ తో పెళ్లి కొడుకు మరణించాడు. కరెంట్ షాక్ రాకుండా జాగ్రత్తగా తీసుకుంటే కచ్చితంగా ఆ పెళ్లి కొడుకు సంతోషంగా ఉండేవాడు. సిద్దిపేట జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ అనే పెళ్లి కొడుకుకి ఆదివారం పెళ్లి జరిగింది. ఇవాళ రిసెప్షన్ కావడంతో అంతలోనే విద్యుత్ షాక్ తో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. పెళ్లి జరిగి 24 గంటలు గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.  ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు నిరంజన్. అతను మరణించాడని తెలియగానే అటు పెళ్లి కూతురు తరపు బంధువులు, ఇటు పెళ్లి కొడుకు తరపు బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news