తెలంగాణ ప్రజలకు శుభవార్త.. త్వరలోనే కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు

-

సిద్ధిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్ధిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు చెప్పారు. సిద్ధిపేటలో అన్నీ రకాల వైద్యం ప్రజలకు అందుబాటులో ఉన్నదని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొంత ఇంటి స్థలం ఉంటే రాబోయే రోజుల్లో రూ.3 లక్షలు మంజూరు చేస్తామని, కొత్త రేషన్ కార్డులు, 57 ఏళ్లు దాటినా వృద్ధులకు ఫించన్లు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.

అనంతరం 15వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. ఇంటింటా నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్తలో పొడి చెత్త రీ సైక్లింగ్ చేస్తున్నట్లు, నిత్యం 10 నుంచి 15 టన్నుల తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నట్లు, 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలతో సేంద్రీయ జీవ ఎరువు తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ 2522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ సీఎన్జీ గ్యాస్ తయారైందని, అలాగే 579 టన్నుల తడిచెత్తతో సేంద్రీయ జీవ ఎరువు తయారైందని మంత్రి చెప్పారు.

దీంతో బుస్సాపూర్ డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగిపోయాయని, జీరో ల్యాండ్ ఫిల్ పట్టణమే లక్ష్యంగా కృషి ఫలితాలు, ప్రజాభాగస్వామ్యంతో నెరవేరుతున్నాయని మంత్రి వెల్లడించారు. పట్టణంలో అవసరమైన చోట రోడ్లు, ఫుట్ పాత్, అవసరమైన చోట మురికాల్వలకు రూ.15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని, 14వ వార్డులో సీసీ రోడ్లు, మురికి కాల్వలకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు, ఈ వార్డులో వరద కాలువ, ఫుట్ పాత్ పొడవు 1.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news