Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

-

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీయూకేటీ బాసరలో పియుసి2 చదువుతున్న విద్యార్థి బుచ్చుక అరవింద్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన క్యాంపస్ హెల్త్ సెంటర్ కు తరలించారు.

అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించింది యూనివర్సిటీ సిబ్బంది. కానీ ఆ లోపే విద్యార్థి మరణించాడు. సిద్ది పేట జిల్లా తోగూట మండలం కు చెందినవాడు విద్యార్థి అరవింద్‌. ఇక విద్యార్థి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వైస్ ఛాన్స్ లర్‌ ప్రొఫెసర్ వెంకటరమణ. అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news