భద్రాచలంలోని పారామెడికల్‌ కళాశాల వద్ద ఆందోళన

-

భద్రాచలంలోని పారామెడికల్‌ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతి చెందింది. గురువారం ఉదయం కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి అపస్మారకస్థితిలో నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్యను విద్యార్థులు గుర్తించారు. అనంతరం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి కారుణ్యను కళాశాల యాజమాన్యం తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య ఆమె మరణించింది.

విద్యార్థిని మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రి నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల డిమాండ్‌ చేస్తున్నారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ ఘటనలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కారుణ్య మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news