లవర్తో లాడ్జికి వెళ్లిన ప్రియుడి అనుమానాస్పద మృతి

-

ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్‌ (28)కు అదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ జంట సోమవారం రోజున హైదరాబాద్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు.

అదే రోజు రాత్రి ఎస్సార్‌నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో రూమ్ తీసుకుని బస చేశారు. అప్పటి వరకు మద్యం తాగి ఉన్న హేమంత్‌ రాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లి ఎంతకు బయటకు రాకపోవడంతో యువతి వెళ్లి చూసింది. హేమంత్ అపస్మారకస్థితిలో కనిపించగా.. అతడి ఫ్రెండ్స్కు యువతి ఫోన్ చేసింది. వారు వచ్చి అంబులెన్స్కు సమాచారం అందించగా పరిశీలించిన వైద్యులు హేమంత్ అప్పటికే హేమంత్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హేమంత్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news