విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది – తమిళ సై

-

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా రాజ్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్. ఈ సందర్భంగా తమిళ సై సౌందర రాజన్ మాట్లాడుతూ… అందరికి విమోచన దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. నేడు పీఎం మోడీ పుట్టిన రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఇప్పుడు చంద్రుడి పై త్రివర్ణ పతాకాన్ని రెపరేపలాడిస్తోందని.. విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు.

ఇది మన స్వేచ్ఛ, సమైక్యతకు ప్రతీక అని.. ఈ హక్కు కోసం ఎందరో నాయకులు జీవితాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో ముందుకి తీసుకెళ్లడంలో మా వంతు కృషి చేస్తామని హామీ ఇస్తున్నానని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎందరో నాయకుల పాత్ర వున్నా…. యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. ఎదో ఒక లక్ష్యం పెట్టుకుని యువత ఈ ఏడాదిలో దానిని పూర్తి చేస్తే బావుంటుంది అనుకుంటున్న….రాజ్ భవన్ తరపున ఏడాది పొడవునా సీపీఆర్ శిక్షణ పై అవగాహన కల్పిస్తుందని వివరించారు. పెద్ద పెద్ద మాటల కంటే … చిన్న చిన్న పనులు గొప్పవని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news