మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య యూటర్న్.. ఇవాళ సాయంత్రం కేసీఆర్ తో భేటీ..!

-

రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నమోదు అవుతున్నాయి. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న అధికార కాంగ్రెస్ చేరికల పర్వానికి తెర లేపింది. బీఆర్ఎస్ పార్టీయే టార్గెట్ గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. నిన్న సాయంత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కేకే నివాసానికి సీఎం రేవంత్ వెళ్లి పార్టీలో రావాలంటూ ఆహ్వానించారు.

అలాగే  ఇవాళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మినిస్టర్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఈ మేరకు ఆయన రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా సూచనాప్రాయంగా తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు జరుపున్నట్లుగా సమాచారం. ఇవాళ సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్ తో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news