జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు..!

-

దసరా పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా  ప్లేయర్లు తిలక్ వర్మ, నితిష్ కుమార్ రెడ్డి  దర్శించుకున్నారు. బంగ్లాదేశ్ తో టీ20 మ్యాచ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన భారత ప్లేయర్లు శనివారం పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మూడో, చివరి టీ 20 మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన  అన్ని ఏర్పాట్లు ఇప్పటికే  పూర్తయ్యాయి.

సిరీస్ ఇప్పటికే భారత్ 2-0 తో గెలిచినప్పటికీ, ఈ చివరి మ్యాచ్  కూడా ప్రాధాన్యత ఉండటంతో ఇరు జట్లు జాగ్రత్తగా బరిలోకి దిగనున్నాయి. సిరీస్ గెలిచిన భారత్, చివరి మ్యాచ్ లో  కూడా విజయాన్ని సాధించి సిరీస్ ను 3-0తో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు.. ఇప్పటికే రెండు మ్యాచ్ లను కోల్పోయిన బంగ్లాదేశ్ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాచ్ లో కఠినంగా పోరాడాలని చూస్తోంది. జట్టులోని కీలక ఆటగాళ్లు తమ శక్తి సామర్థ్యాలను చూపించి, విజయం సాధించాలని కసరత్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version