BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

-

BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే… సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. మొదటగా.. మల్లు స్వరాజ్యంకి సంతాపం ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం..తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అని కొనియాడారు. మద్యపాన నిషేధ ఉద్యమంలో ఆమెది చురుకైన పాత్ర అని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆమె సేవలు మరువలేనివి అని వివరించారు. అనంతరం మల్లు స్వరాజ్యం, జనార్థన్ రెడ్డిలకు సంతాపం తెలుపుతూ… రెండు నిముషాలు మౌనం పాటించింది సభ. అనంతరం సోమవారానికి సభ వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news