ఇవాళ వరంగల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. షెడ్యూల్ ఇదే

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇవాళ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ మాత్రం… తన సమయాన్ని తెలంగాణకు కేటాయించారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి.. వరంగల్ పర్యటనకు వెళ్తారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో… శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో… నేరుగా వరంగల్ వెళ్తారు. ఒకటిన్నర గంటలకు… కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్కుకు చేరుకుంటారు.

Revanth Reddy 

అక్కడ వివిధ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు రేవంత్ రెడ్డి. అనంతరం రెండు గంటల తర్వాత… వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను కూడా పరిశీలిస్తారు. మూడు గంటల సమయంలో… హనుమకొండ లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ను సందర్శిస్తారు. అయితే ఈ పర్యటనలో… వరంగల్ రెండవ రాజధాని అని ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి వరంగల్ టూర్… ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news