ఖమ్మంలో రిటైనింగ్ వాల్ నిర్మించాల్సిందే..కేంద్ర బృందంతో రేవంత్‌ !

-

ఖమ్మంలో రిటైనింగ్ వాల్ నిర్మించాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో వరదలతో నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టీం సమావేశం అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్నారు.

వరదల నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు సీఎం రేవంత్‌ రెడ్డ. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి… భవిష్యత్ లో రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం యాక్షన్ ప్లాన్ ఉండాలని విజ్ఞ ప్తి చేశారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news