ఇవాళ మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

-

మొన్న ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఇవాళ మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ రోజు “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ”(సిడబ్ల్యుసి) కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే… నేడు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు.

Telangana CM Revanth Reddy is once again in Delhi today

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అజెండా గా సమాలోచనలు ఈ సమావేశంలో చేయనున్నారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసిసి కార్యాలయంలో “సిడబ్ల్యుసి” సమావేశం జరుగనుంది.

ఈ సమావేశంలో రఘువీరా రెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, వంశీచందర్ రెడ్డి, టి. సుబ్బరామిరెడ్డి, దామోదర్ రాజనర్సింహ పాల్గొంటున్నారు. అలాగే… కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుఖు లు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news