తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 459 కేసులు నమోదు

-

తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 459 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 799991 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఎవరూ మరణించలేదు. దీంతో ఇప్పటి వరకు 4111 మంది కరోనా మహమ్మారి తో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 4172 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 791708 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 97.84 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.28 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.59% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,55,3పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 3,55,58,326 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news