నేడు హైకోర్ట్ కి మరోసారి తెలంగాణా సిఎస్…!

-

తెలంగాణ రాష్ట్రం లో కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. హైకోర్టు విచారణ హాజరు కావాలని గతంలో సీఎస్ కు హైకోర్టు అదేశం ఇచ్చింది. నేడు హైకోర్టు విచారణకు కు హాజరు కానున్నారు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్. గత విచారణ లో ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలపై ప్రభుత్వం అమలు చేసిన వాటిపై నేడు మరోసారి విచారించనుంది.

ఐసిఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లెన్స్ ను తూచా తప్పక పాటించాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం ఇచ్చింది. ప్రతి రోజు కరోనా హెల్త్ బులిటెన్ తప్పులు లేకుండా ఇవ్వాలని స్పష్టం చేసింది. కరోనా సమాచారాన్ని ప్రతి రోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రసారం చేయాలని హైకోర్టు అదేశం ఇచ్చింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్ ,కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్ ను వాడుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాల ను తప్పని సరి అమలు చేస్తామని సిఎస్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news