నేటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు

-

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇవాళ్టి నుంచి డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల అప్లికేషన్లు అందగా.. ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 2,40,727 మంది అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా….10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లో ఉండాలని విద్యాశాఖ తెలిపింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. మొత్తం 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతల చొప్పున టీచర్ పరీక్షలు జరుగుతాయి.

డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇదే..

  • జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష
  • జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
  • జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
  • జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
  • జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష
  • జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

Read more RELATED
Recommended to you

Latest news