ఇవాళ తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గది

-

పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలోని మూడో గది ఈరోజు (జులై 18వ తేదీ 2024) మళ్లీ తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి, ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్‌ వేసి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాలను ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరచనున్నారు.

ఈరోజు ఉదయం 9గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఆభరణాలన్నిటినీ తరలించాకే పురావస్తుశాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్‌ఐ అధికారులు, రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారు. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్‌ చేస్తారు. రహస్య గదిని తెరవనున్న నేపథ్యంలో ఇవాళ ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news