రాష్ట్రంలో ఓటరు జాబితా నుంచి 9,14,354 మంది తొలగింపు

-

రాష్ట్రంలో 9 లక్షల 14 వేల 354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఓట్ల తొలగింపు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన  ప్రక్రియను పూర్తి  చేసినట్లు వెల్లడించారు. మొత్తం 7 లక్షల 31 వేల 573 మంది వివరాలు సవరించినట్లు చెప్పారు. నూతనంగా ఓటరు నమోదుతోపాటు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గంకి మార్చుకునేందుకు ఏప్రిల్‌ 15 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.

“రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 30 లక్షల 13 వేల 318కి చేరింది. ఓటర్లలో పురుషులు కోటీ 64 లక్షల 14 వేల 693 మంది కాగా మహిళలు కోటీ 65 లక్షల 95 వేల 896 మంది. ట్రాన్స్ జెండర్లు 2 వేల 729 మంది ఉండగా.. 15 వేల 472 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 8 లక్షల 72 వేల 116 మంది ఉండగా.. 85 ఏళ్ల దాటిన వారు లక్ష 93 వేల 489 మంది, దివ్యాంగులు 5 లక్షల 26 వేల 286, ఎన్ఆర్ఐ ఓటర్లు 3 వేల 409 మంది ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా. 38 కోట్ల 12 లక్షల రూపాయల విలువైన నగదు, నగలు, మద్యం, డ్రగ్స్, వస్తువులు స్వాధీనం చేసుకున్నాం అని వికాస్ రాజ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news