తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

-

ఇంజినీరింగ్‌ చేయాలనుకునే విద్యార్థులకు అలర్ట్. బీటెక్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్చింది. ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 22వ తేదీ వరకు పొడిగించారు. నాలుగు కొత్త కాలేజీలు అందుబాటులోకి రావడంతో.. ఇవాళ ప్రారంభమైన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు.

మహబూబాబాద్, పాలేరులో జేఎన్టీయూ కాలేజీలతో పాటు.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, టీకేఆర్ పాలిటెక్నిక్‌లు ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. కొన్ని కాలేజీల్లో అదనపు సీట్లు, కోర్సులకు కూడా అనుమతి లభించింది. శుక్రవారం రోజున ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. నేటి నుంచి ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి.. ఈనెల 26న ప్రత్యేక విడత సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 27 నుంచి 29 వరకు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఈనెల 26న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news