వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

-

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు తేదీని మరొకసారి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఇచ్చిన డిస్కౌంట్ను పొడగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహనాలపై పెండింగ్ చలాన్లు భారీగా పేరుకుపోవడంతో ప్రభుత్వం పెండింగ్ చలాన్ల చెల్లింపు పై రాయితీ కల్పించిన విషయం తెలిసిందే.

తొలుత డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు  చెల్లింపునకు డిస్కౌంట్ ఇచ్చింది. ఈ సమయంలో ఈ చాలా వెబ్ సైట్లు మొరాయించడంతో వాహనదారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు రాయితీ  అవకాశాన్ని కల్పించింది. అయితే ఇవాల్టితో ఈ గడువు ముగుస్తుండటంతో.. ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పెండింగ్ చాలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ను మరోసారి పొడగించింది.

Read more RELATED
Recommended to you

Latest news