గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 8వ తేదీన జరగనున్న పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. జూన్‌ 8వ తేదీన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్  గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలంటూ ఇద్దరు వ్యక్తులు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. ఇంటిలిజెన్స్ పోస్టు నిమిత్తం 700 మంది మాత్రమే దరఖాస్తు చేశారని, గ్రూప్-1కు 4 లక్షలకుపైగా అభ్యర్థులు ఇప్పటికే  హాల్‌టికెట్లను సైతం  డౌన్లోడ్ చేసుకున్నారని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ వాదనపై ఏకీభవించిన న్యాయమూర్తి పరీక్ష వాయిదా వేయడాన్ని నిరాకరిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు. ఇక జూన్ 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 1వ తేదీ నుంచి హాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news