తెలంగాణ ఇంటర్ రిజల్ట్.. 8 మంది ఆత్మహత్య !

-

ఇంటర్ ఫలితాలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. నిన్న విడుదలైన TS ఇంటర్ ఫలితాల తర్వాత రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు మహబూబాబాద్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

ఫెయిల్ అవుతాననే భయంతో కృష్ణ అనే విద్యార్థి ఫలితాలకు ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ నిన్న రిజల్ట్ చూసే అతడికి 892 మార్కులు వచ్చాయి. ఇక తాజాగా మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌ మణికొండలో చోటు చేసుకుంది. ఇంటర్ ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది… ఐదో అంతస్తుపైనుంచి దూకి విద్యార్థిని శాంతకుమారి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఆత్మహత్యతో వీరి సంఖ్య 8కి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news