ఐపీఎల్ 2023: నేటి మ్యాచ్ లో ఫేవరేట్ ధోని టీం అయినా వార్నర్ సేనను తక్కువ అంచనా వేయలేం !

-

ఈ రోజు చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం.. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఈ రోజు మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లినట్లే. అందుకే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంది. చెన్నై తన లాస్ట్ మ్యాచ్ లో ముంబై విజయం సాధించగా, ఢిల్లీ కూడా తన లాస్ట్ మ్యాచ్ లో బెంగుళూరు ను చిత్తు చేసింది. కాగా ప్రస్తుతం ఢిల్లీ 10 మ్యాచ్ లలో 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఇక మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి భారీగా రన్ రేట్ ను సాధించగలిగితే ప్లే ఆఫ్ కు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి.

కాగా నేటి మ్యాచ్ లో అన్ని విధాలుగా చెన్నై ఫేవరేట్ అయినప్పటికీ.. ఢిల్లీ సేనను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. ప్రస్తుతం ఫిలిప్ సాల్ట్, మార్ష్ మరియు రాసౌ లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లోనూ ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ లు రాణిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news