బెజవాడలో దారుణం..బీటెక్ విద్యార్థి సుధాకర్ డెడ్ బాడీ లభ్యం

-

బెజవాడలో దారుణం చోటు చేసుకుంది. పంట పొలాల్లో బీటెక్ విద్యార్థి సుధాకర్ డెడ్ బాడీ లభ్యం అయింది. సుధాకర్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. పేద పులిపాక పంట పొలాల్లో మృతదేహం గుర్తించారు స్థానికులు.

బెజవాడ మాచవరం ప్రాంతానికి చెందిన సుధాకర్ గా గుర్తించారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్న సుధాకర్… నిన్న రాత్రి స్నేహితుడు శ్యాం పుట్టిన రోజు వేడుకల కోసం ఇంటి నుంచి వెళ్లాడు. బర్త్ డే పార్టీ మధ్య ఫోన్ రావటంతో వెళ్ళాడని చెబుతున్నారు స్నేహితులు. పెట్రోల్ పోసి తగులబెట్టి న ఆనవాళ్లు బట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news