తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆర్టీసి బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసి అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.. పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు బస్సు అపమన్న చోట ఆపాలని ,సెంటర్ల వద్ద బస్సు ఎక్కే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసి అధికారులకు సూచించారు.

Telangana Inter Vidya RTC Good News

పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని శుభాకాంక్షలు తెలిపారు.. రేపటి భవిష్యత్ పునాది ఇంటర్మీడియట్ కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు చూపిస్తే మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు… ఇన్ని రోజులు కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్షల్లో అప్లై చేయడమే ప్రధానమైందని విద్యార్థులు చాలా జాగ్రత్తగా పరీక్షలు రాయాలని తెలిపారు.. పరీక్షలు రాసే ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు..

Read more RELATED
Recommended to you

Latest news