కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు : కేటీఆర్

-

రాష్ట్రంలో ప్రజలంతా కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యానిర్వహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అంటున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా.. కేసీఆర్ రావాలన్న మాటే వినిపిస్తోందని కేటీఆర్ అన్నారు.

ఈరోజు సిరిసిల్లలో కరీంనగర్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్‌పల్లి విన్‌ద్‌కుమార్ మద్దుతుగా  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆయన పట్టణంలోని రైతు బజార్, గాంధీ చౌక్,లేబర్ అడ్డా ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పుడు సిరిసిల్ల మానేరు వాగులో నీళ్లు లేవని, ఒక నెల పెన్షన్ కూడా రాలేదని చెప్పారు. అన్నదాతలు రుణమాఫీ చేయలేదని, రైతుబంధు రాలేదని చెప్పారని వివరించారు. తప్పకుండా మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ఎంపీగా వినోద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి బీఆర్ఎస్‌ పార్టీకి మంచి స్పందన వస్తుందని కేటీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news