తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 24వ తేదీన పాలిసెట్ రాత ప‌రీక్షకు 82,809 మంది హాజరయ్యారు. పాలిసెట్ పరీక్షల్లో 84.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు.

మొత్తం 69వేల 728 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. మే 24వ తేదీన జరిగిన పరీక్షకు 92వేల 808 మంది దరఖాస్తు చేసుకోగా .. 82వేల 809 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news